ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 20 మందికి గాయాలు

by Kodari Anjali |

లారీని ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటనలో సుమారు 20 మందికి గాయాలయ్యాయి.

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 20 మందికి గాయాలు
X

దిశ, కొండపాక: లారీని ఆర్టీసి బస్సు ఢీకొట్టిన ఘటనలో సుమారు 20 మందికి గాయాలైన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసి బస్సు సిద్దిపేట నుండి వెళ్తుండగా మార్గమధ్యలో లకుడారం స్టేజీ వద్ద రాగానే ఓవర్ టేక్ చేయబోయి, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో బస్సులో ఉన్న దాదాపు 20 మందికి గాయలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story