- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్ న్యూస్.. అధికార పార్టీ మున్సిపల్ చైర్ పర్సన్ పై కౌన్సిలర్ల తిరుగుబాటు
దిశ, సంగారెడ్డి : మున్సిపల్ చైర్ పర్సన్ పై అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ మున్సిపల్ నిధులను పెద్ద ఎత్తున స్వాహా చేశారంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీలో విధులు నిర్వహించకుండానే హైదరాబాద్ లో ఉంటూ చైర్ పర్సన్ బందువులు జీతాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు కొత్తపల్లి నాని(శ్రీకాంత్), సమీ, ఉమామహేశ్వరి, జీ.వీ.వీణా శ్రీనివాస్, విజయలక్ష్మి లు అవినీతికి పాల్పడిన చైర్ పర్సన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ సమావేశం ప్రారంభం కాగానే చైర్ పర్సన్ అవినీతిపై ద్వజమెత్తారు. అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. ఆరోపణలపై రుజువు ఉంటే చూపించాలని , ఆరోపణలు చేస్తున్న కౌన్సిలర్లపై పోలీసు కేసు పెడతానని చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు.