దూప్‌సింగ్‌ తండాను ముంచెత్తిన వరద.. ప్రజలు ఇళ్లు ఎక్కి ఆర్తనాదాలు

by Vemula.Srinu Prasad |

మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం దూప్‌సింగ్‌ తండాలో వర్షం కుమ్మేసింది.....

దూప్‌సింగ్‌ తండాను ముంచెత్తిన వరద.. ప్రజలు ఇళ్లు ఎక్కి ఆర్తనాదాలు
X

దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లా(Medak District) హావేలిఘనపూర్ మండలం దూప్‌సింగ్‌ తండా(Dhoop Singh Thanda)లో వర్షం(Rain) కుమ్మేసింది. ఉదయం నుంచి కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అయితే దూప్ సింగ్ తండాను ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఇళ్లు, గుడుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఇళ్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ప్రజలు.. అంతేకాదు తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు గ్రామస్తులు సైతం వరదలో చిక్కుపోయారు. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Next Story