- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జూనియర్ పంచాయతీ కార్యదర్శులది న్యాయమైన డిమాండే : టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
దిశ కొండపాక : పంచాయతీ కార్యదర్శులది న్యాయమైన కోరికేనని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎదుట తమ నాయ్యమైన కోరికలను నేరవేర్చాలని కోరుతు పంచాయితీ కార్యదర్శలు చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరింది. మంగళవారం వారి సమ్మేకు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులది న్యాయమైన కోరికేనని నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగానే వెంటనే వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
మిగతా పార్టీల వారితో చర్చించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. పంచాయతీకి కార్యదర్శుల సమ్మెకు సంఘీభావంగా హుస్నాబాద్ మండలం చెందిన పంచాయతీ కార్యదర్శి శృతి భర్త వచ్చి సమ్మెకు సంఘీభావంగా రూ.10వేలు అందజేశారు. అనంతరం వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చిన టెర్మినేషన్ నోటీసు గడువు సాయంత్రం ఐదు గంటలు గడచినా.. ఎవరూ విధులకు హాజరుకాకపోవడం గమనార్హం.