మాన‌వ‌త్వం చాటుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

by Disha Web Desk 12 |
మాన‌వ‌త్వం చాటుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
X

దిశ, దుబ్బాక: మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి మాన‌వత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెలితే..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హైద‌రాబాద్ నుంచి దుబ్బాకకి వస్తున్న మార్గమధ్యంలో ఓ కారు అదుపుత‌ప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదాన్ని చూసిన ఎంపీ కారు ఆపి, క్షత‌గాత్రుల వ‌ద్దకు వెళ్లారు. ప్రమాదం జ‌రిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారిలో మ‌నోధైర్యం నింపారు. అనంత‌రం క్షత‌గాత్రుల‌ను ద‌గ్గరుండి ద‌వాఖాన‌కు పంపించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Next Story

Most Viewed