విద్యార్థులకు ఆర్థిక సహాయం అందచేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

by Disha Web Desk 13 |
విద్యార్థులకు ఆర్థిక సహాయం అందచేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
X

దిశ, మెదక్ ప్రతినిధి: గత జూన్ 28 న ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు విద్యార్థులు, పూర్తిగా అంగవైకల్యం చెందిన ఒక విద్యార్థి కుటుంబానికి మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి రెండు లక్షల రూపాయల చొప్పున ఆ కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందజేశారు. 28 జూన్ 2022 న కొల్చారం మండలం రంగంపేట జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు శివాయిపల్లి జశ్వంత్, తూర్పాటి రజినీకాంత్ లో ప్రమాదంలో మరణించగా, రాంచరణ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి పూర్తి అంగవైకల్యం పొందాడు. గురువారం కలెక్టరేట్ లోన్ వీడియో కాన్ఫరెన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేష్ లతో కలిసి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృధి అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : తీన్మార్ మల్లన్న నాకు ఎవరో తెలియదు: కేఏ పాల్

Next Story