Harish Rao: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి హరీశ్ రావు

by Disha Web Desk 1 |
Harish Rao: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి హరీశ్ రావు
X

ఏర్పాట్లు పరిశీలించిన చింతా ప్రభాకర్

సదాశివపేటలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

దిశ , సంగారెడ్డి: రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం2.30 గంటలకు కంది మండల పరిధిలోని కాశీపూర్ గ్రామంలో బసవ భవన్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 3.30 గంటలకు సదాశివపేట పట్టణానికి సంబందించిన లబ్ధిదారులకు సిద్ధాపూర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేస్తారు. తరువాత న్యాల్కల్ మండలంలో నిర్వహిస్తున్న కుంభమేళాలో పాల్గొంటారు.

మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా వీరశైవ లింగాయత్ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం, ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో నగేష్ , మాజీ సీడీసీ చైర్మెన్ విజేందర్ రెడ్డి , బీఆర్ఎస్ కంది మండలాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, పట్టణాధ్యక్షులు ఆర్.వెంకటేశ్వర్లు, వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు మధుశేఖర్, జీవి శ్రీనివాస్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story