- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
Home > జిల్లా వార్తలు > మెదక్ > జనవరి 18 నుంచి 'కంటి వెలుగు' కార్యక్రమం ప్రారంభం : Minister Harish Rao
జనవరి 18 నుంచి 'కంటి వెలుగు' కార్యక్రమం ప్రారంభం : Minister Harish Rao
by Disha Web Desk 13 |

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి: సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నట్లుగా.. మీ కష్టాలు, ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని, కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించుకున్న దాదాపు 3 వందల మందికి మంత్రి హరీష్ రావు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జనవరి 18వ తేదీ నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని 3 వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించి, కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా శర్మ, డీఎంహెచ్వో కాశీనాథ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
READ MORE
Next Story