రైతుల సంక్షేమం కోసం మిల్లర్లు పాటుపడాలి : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి

by Disha Web Desk 1 |
రైతుల సంక్షేమం కోసం మిల్లర్లు పాటుపడాలి : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి
X

దిశ, వెల్దుర్తి : ఆరుగాలం శ్రమించి ధాన్యం సేకరించిన వారి సంక్షేమం కోసం రైస్ మిల్లర్లు పాటుపడలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని హస్తాల్ పూర్ గ్రామ శివారులో కొందరు వ్యాపారస్థులు నూతనంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్లు ప్రారంభోత్సవంలో సునీతారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు పండించిన ధాన్యాన్ని వేగంగా సేకరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపార రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రైస్ మిల్ యజమానులు సంతోష్ గుప్తా, మల్లేశం చారి, రంగారెడ్డి, రాజు, సంతోష్, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story