ఆటో బైక్ ఢీ వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
ఆటో బైక్ ఢీ వ్యక్తి మృతి..
X

దిశ, నర్సాపూర్ : ఆటో బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన నర్సాపూర్ సమీపంలోని సంగారెడ్డి మార్గంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ (42) అతని స్నేహితుడైన కృష్ణతో కలిసి దౌల్తాబాద్ వైపువెళ్తున్న గ్రామంలో అటు నుంచి వస్తున్న ట్రాలీ ఆటో బైక్ ను బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణ నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్ ఎస్సై శివకుమార్ తెలిపారు.


Next Story