ఘనంగా కొల్కూర్ సదాశివుని రథోత్సవం

by Disha Web Desk 1 |
ఘనంగా కొల్కూర్ సదాశివుని రథోత్సవం
X

ఎండ్లబండ్ల పదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే..

దిశ, సదాశివపేట: మండల పరిధిలోని కొల్కూరు సదాశివ ఆలయంలో సదాశివసేవా సమితి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 18వ రథోత్సవం, వార్షికోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లచే ప్రదక్షిణ కార్యక్రమం స్వామి వారి కల్యాణము వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షులు సిద్ధన్న మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రామిరెడ్డి, మాజీ కోఆపరేటివ్ చైర్మన్ మాణిక్ రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రథోత్సవంలో పొట్టిపల్లి, కోల్కూర్, నిజాంపూర్, మాచిరెడ్డిపల్లి పరిసర గ్రామాల ప్రజలు భారీగా పాల్గొన్నారు.


Next Story