కేసీఆర్‌కు కాలం చెల్లింది ఫామ్ హౌస్‌కు పంపాలి

by Disha Web Desk 22 |
కేసీఆర్‌కు కాలం చెల్లింది ఫామ్ హౌస్‌కు పంపాలి
X

దిశ, నర్సాపూర్: కేసీఆర్‌కు టైం అయిపోయిందని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ సమీపంలోని వెల్దుర్తి రూట్‌లో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేట ముంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అని ఆయనను వంద మీటర్ల లోతు గొయ్యి తీసి అందులో పాతి పెట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం బొందల గడ్డ బెల్టు షాపుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని హితువు పలికారు. 50 సంవత్సరాలు తన వెంట తిప్పుకున్న చిరకాల మిత్రుడని చెప్పుకుంటున్న ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నర్సాపూర్ నియోజకవర్గ గిరిజనుల అభివృద్ధి కోసం వంద కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పేర్కొన్నారు. చార్మినార్ జోన్‌లో ఉన్న నర్సాపూర్‌ను సిరిసిల్ల జోన్లోకి మార్చి ఇక్కడ యువతకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారని తాము అధికారంలోకి రాగానే తిరిగి చార్మినార్ జోన్లోకి నర్సాపూర్ కలుపుతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పడానికి చేయడానికి ఏమీ లేకనే కాంగ్రెస్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. అధికారంలోకి రాగానే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని తెలిపారు.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story