ఘర్షణకు దారితీసిన అక్రమ మట్టి దందా..

by Disha Web Desk 13 |
ఘర్షణకు దారితీసిన అక్రమ మట్టి దందా..
X

దిశ, తూప్రాన్/మనోహరబాద్: అక్రమ మట్టి దందా ఘర్షణకు దారి తీసిన ఘటన మనోహరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. ప్రతిరోజు ఉదయం, రాత్రి అక్రమంగా ప్రభుత్వ భూమి నుండి మట్టిని రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం వెంచర్లకు అక్రమ మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లను స్థానిక గ్రామ ప్రజలు అడ్డుకొని నిలదీశారు.


స్థానిక పోతారం పాలాట గ్రామాల ప్రజలు గురువారం రాత్రి అక్రమ రవాణాలకు పాల్పడుతున్న బండ్ల కి అడ్డుగా పాలాట రైల్వే గేట్ దగ్గర భారీ ఎత్తున బండ్లను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫోన్ చేశారు. కానీ అధికారుల స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆ గ్రామంలోని గత కొన్ని రోజులుగా జాతీయ రహదారి పేరు చెప్పుకుని ప్రైవేటు వెంచర్లకు మట్టి తరలిస్తున్నారని తెలిపారు.


Next Story