ఏటీఎం దీపావళి ఆఫర్..!? రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేల క్యాష్

by Disha Web Desk |
ఏటీఎం దీపావళి ఆఫర్..!? రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేల క్యాష్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : దీపావళి ధమాకా ఆ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన వినియోగదారులకు పంట పండింది. వెయ్యి రూపాయలు డ్రా చేస్తే 2000 రూపాయలు వచ్చాయి. ఇంతకీ ఆ ఏటీఎం ఎక్కడుందంటే సిద్దిపేట కమాన్ రోడ్ లోని బీఓఐ బ్యాంక్ ఏటీఎం. వివరాల్లోకెళ్తే.. సిద్దిపేట పట్టణంలోని కమాన్ రోడ్‌లో గల బీఓఐ బ్యాంక్ ఏటీఎంలో మంగళవారం సాంకేతిక సమస్య మూలంగా వినియోగదారులు డ్రా చేసిన డబ్బుల కంటే అధికంగా వచ్చాయి. కస్టమర్ రూ.1000 డ్రా చేస్తే రూ.2000 వచ్చాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట పట్టణంలో తెలియడంతో పలువురు ఆ ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు ఏటీఎం వద్దకు వచ్చి సాంకేతిక సమస్యను సరిదిద్దే పనిలో పడ్డారు.

ఇవి కూడా చ‌ద‌వండి

1.ఎస్‌బీఐ హెచ్చరిక.. వినియోగదారులు వెంటనే ఫిర్యాదు చేయాలి!

Next Story

Most Viewed