- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్..
దిశ, నర్సాపూర్: ల్యాప్ ట్యాప్ కలిగిన బ్యాగ్ తో ఓ ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సులో మంగళవారం ప్రయాణం చేసి తన బ్యాగును బస్సులో మరిచిపోయి దిగింది. ఇది గమనించిన ఆ బస్సు కండక్టర్ సదరు ప్రయాణికురాలికి సమాచారం ఇచ్చి, ల్యాప్ ట్యాప్ ను అందజేసి నిజాయితీని చాటుకుంది. వివరాల్లో వెళితే.. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెదక్ వెళ్తున్న బస్సులో నర్సాపూర్ పట్టణంలోని దివ్య శక్తి గ్రానైట్స్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగి సంధ్య బస్సు ఎక్కి వస్తున్న క్రమంలో బస్సులో నుంచి కంగారులో ల్యాప్ ట్యాప్ కలిగిన బ్యాగును మర్చిపోయింది.
అది గమనించిన కండక్టర్ శోభారాణి నర్సాపూర్ బస్టాండ్ లోని ఆర్టీసీ అధికారులకు తెలుపగా ఆమెను పిలిపించి సంధ్యకు తిరిగి ల్యాప్ ట్యాప్ అందజేశారు. ఈ సందర్భంగా దివ్య కండక్టర్ శోభారాణికి, ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో రావులకోరి నాగమణి, మధుసూదన్ రెడ్డి, సతీష్ తదితరులు ఉన్నారు.