అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

by Disha Web Desk 1 |
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
X

దిశ, పెద్ద శంకరం పేట్ : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం పెద్ద శంకరంపేటలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతు వేదికపై ఆయన మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మొద్దని అన్నారు. గత పాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనుకంజలో ఉండేదని గుర్తుచేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. చెరువులు కుంటల మరమ్మతులో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ పంటల్లో అధిక దిగుబడిని సాధిస్తున్నారని తెలపారు. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వడంతో పాటు నిరుపేదలందరికీ బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. గొల్ల, కురుమల అభివృద్ధి కోసం ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

నూతనంగా గృహాలు నిర్మించుకునే వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ జడ్పీటీసీ విజయరామరాజు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, బీఅర్ ఎస్ సీనియర్ నాయకుడు విగ్రం వేణుగోపాల్ గౌడ్, ఎంపీటీసీలు వీణ సుభాష్ గౌడ్ దత్తు, రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్, మాజీ ఎంపీపీ బాసడ రాజు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed