పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ క‌విత

by Nallavelli.Anjaneyulu |

దిశ, చిన్నశంకరంపేట : జనం బాటలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట కవిత మెదక్ జిల్లాలో రెండో రోజు ప‌ర్య‌టించారు. శనివారం సాయంత్రం 7:30 గంటలకు చిన్న శంకరంపేటకు చేరుకొని మండల

పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ క‌విత
X

దిశ, చిన్నశంకరంపేట : జనం బాటలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట కవిత మెదక్ జిల్లాలో రెండో రోజు ప‌ర్య‌టించారు. శనివారం సాయంత్రం 7:30 గంటలకు చిన్న శంకరంపేటకు చేరుకొని మండల కేంద్రంలోని అమరవీల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జనం బాట లో భాగంగా నర్సాపూర్, మెదక్, నియోజకవర్గంలో పర్యటించారు. మెదక్ మండలం ధూప్ సింగ్ తాండలో వర్ష బీభత్సవానికి పొలాలన్నీ ఇసుక మేటలతో పొలాలు నిండిపోయాయని అక్కడి రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. అక్కడి రైతులను ఆమె ప‌రామ‌ర్శించిన‌ట్టు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఇసుక మేటర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మా జాగృతి కార్యకర్తలు ప్రజా సమస్యలపై రేపటి నుంచి సమస్యలపై తెలుసుకుంటారని ఆమె తెలిపారు. అక్కడి రైతులను ఆమె ప‌రామ‌ర్శించిన‌ట్టు తెలిపారు.

Next Story