- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి: మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా తన ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ నింపి బీఎల్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... గతంలో జరిగిన మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశాం కదా, ఇప్పుడు మళ్లీ కొత్తగా అప్లికేషన్ నింపాల్సిన అవసరం లేదని ఎవరూ అపోహ పడవద్దు అన్నారు. గతంలో మీరు ఓటు వేసినా సరే, ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇస్తేనే మీ ఓటు హక్కు జాబితాలో భద్రంగా ఉంటుందన్నారు. ప్రజలందరూ తమ ఇళ్ల వద్దకు వచ్చే బీఎల్ఓ, బీఎల్ఏ లకు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి, ఈ నెల 24వ తేదీలోగా సంబంధిత అధికారులకు అందజేయాలని హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






