అప్పుల బాధతో పురుగుల మందు తాగి.. యువరైతు ఆత్మహత్య

by Web Desk |
అప్పుల బాధతో పురుగుల మందు తాగి.. యువరైతు ఆత్మహత్య
X

దిశ, కొల్చారం: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన యువరైతు మృతి చెందిన సంఘటన బుధవారం కొల్చారం మండలం లో జరిగింది. పైతర గ్రామానికి చెందిన యువ రైతు కంటే అర్జున్ (45) వ్యవసాయ అవసరాల కోసం నూతన ట్రాక్టర్ తీసుకోగా గత రెండు సంవత్సరాలుగా పంటలు పండక అప్పులు పెరిగిపోయాయి. దీంతో భూమిని అమ్మి అప్పు తీరుస్తానని ఇంట్లో చెప్పగా భార్య, పిల్లలు భూమి అమ్మడానికి ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన అర్జున్ ఇంట్లో అందరూ నిద్రించిన సమయంలో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం మెదక్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుని భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed