పాలిసెట్ నిర్వహణకు సర్వం సిద్ధం

by Disha Web Desk 1 |
పాలిసెట్ నిర్వహణకు సర్వం సిద్ధం
X

పరీక్షలకు హజరుకానున్న 2760 మంది విద్యార్థులు

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 కొనసాగనున్న పరీక్ష

జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఎం.శ్రీనివాసులు

దిశ, సంగారెడ్డి : రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ లోని మూడు సంవత్సరాల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుతో పాటు, వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా ప్రవేశం కోసం 17న జరిగే పాలిసెట్-2023 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త డాక్టర్. ఎం. శ్రీనివాసులు, సహయ సమన్వయకర్త జి.మల్లికార్జున్ తెలిపారు.

సోమవారం సంగారెడ్డి- ఇస్మాయిల్ ఖాన్ పేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రధానాచార్యులు కార్యాలయంలో మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,760 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని, సంగారెడ్డి పట్టణంలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగుతోందని, విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9:30 లోపు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 10:00 గంటల నుంచి అనుమతిస్తామని, 11:00 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్నారు.

డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఫోటో ప్రింట్ కాని వారు పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించుకొని ఎవరైనా గజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేసుకోవాలన్నారు. https://polycetts.nic.in నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, హెచ్.బీ పెన్సిల్, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎరేజర్ తెచ్చుకోవాలని కోరారు. సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, క్యాలిక్యులేటర్, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు పరీక్ష మధ్యలో టాయిలెట్ కు అనుమతించమని వెల్లడించారు.


Next Story

Most Viewed