జిల్లాలో సమర్ధవంతంగా నీటి సంరక్షణ : కేంద్ర జలశక్తి అభియాన్ అధికారుల ప్రశంస

by Disha Web Desk 1 |
జిల్లాలో సమర్ధవంతంగా నీటి సంరక్షణ : కేంద్ర జలశక్తి అభియాన్ అధికారుల ప్రశంస
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : జిల్లాలో నీటి సంరక్షణ చర్యలు సమర్థవంతంగా ఉన్నాయని కేంద్ర జలశక్తి అభియాన్ అధికారులు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో నీటి సంరక్షణపై సెంట్రల్ డిఫెన్స్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ అండ్ అడిషనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వేద్ వీర్ ఆర్య నేతృత్వంలోని కేంద్ర జలశక్తి అభియాన్ బృందం సభ్యులు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా నీటి సంరక్షణ కోసం నీటి సంరక్షణ, వర్షం నీరును ఒడిసిపట్టేందుకు చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల నిర్మాణం, అటవీ ప్రాంతాల్లో రాక్ ఫీల్ డ్యామ్స్, చెక్ డ్యాంలు, వాటర్ సాసర్ల నిర్మాణం నిర్మాణం, వ్యవసాయ రంగంలో వరికి బదులు తక్కువ సాగునీటితో సాగయ్యే ఆయిల్ ఫామ్ తదితర ప్రత్యామ్నాయ పంటల సాగు, బిందు సేద్యం, గ్రామాలు మరియు మున్సిపాలిటీల్లో నీటి సంరక్షణ కార్యక్రమాలు తదితర చర్యలను సంబంధిత శాఖల అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి అధికారి వేద్ వీర్ ఆర్యా మాట్లాడుతూ.. జిల్లాలో వర్షం నీటిని ఒడిసి పట్టడం, నీటి సంరక్షణకు జిల్లాలో చేపట్టిన పనులు చాలా బాగా ఉన్నాయని అభినందించారు. భూగర్భ జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన పనుల ఫలితాలు కనబడుతున్నాయన్నారు. నీరు అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైనదని మానవ శరీరంలో కూడా 75 శాతం నీరు ఉంటుందన్నారు.

పాఠశాలలలో పిల్లలకు నీటి సంరక్షణ గురించి చెబుతున్న తీరు చాలా బాగా ఉందని బావి పౌరులైన చిన్నారులకు, ప్రజలందరికీ నీటి సంరక్షణ పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్, డీఆర్డీఓ చంద్రమోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, జిల్లా హార్టికల్చర్ అధికారి కవిత, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed