దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు భారీగా తరలి రావాలి: కిష్టయ్య

by Dishanational1 |
దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు భారీగా తరలి రావాలి: కిష్టయ్య
X

దిశ, హత్నూర: ఈనెల 26న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు కురుమ సంఘం నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లాలని కురుమ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసుగారి కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 26 తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ, కురుమ సంఘం భవన శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లాలోని కురుమ సంఘం నాయకులు కురుమ సంఘం గ్రామాలకు చెందిన వ్యక్తులు హాజరుకావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దొడ్డి కొమురయ్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పేద కుటుంబాలను ఆర్థికంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు గౌడ్ చర్ల శ్రీశైలం, నర్సింలు, ఆంజనేయులు, నాగేష్, జనార్దన్, మల్లేష్ తదితరులు ఉన్నారు.


Next Story