ఇంటర్ విద్యార్థి అదృశ్యం

by Disha Web Desk 1 |
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
X

దిశ, జహీరాబాద్: ఇంటర్ విద్యార్థి అదృశ్యమైన ఘటన విట్టునాయక్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విట్టునాయక్ తండాకు చెందిన కేతావత్ నారాయణ కుమారుడు కరన్ కుమార్(19) అల్వాల్ లోని విజ్ఞాన భారతి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గత నెల 29న బంధువుల పెళ్లి సంధర్భంగా స్వగ్రామానికి వచ్చి అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో జహీరాబాద్ లో పట్టణంలో పనుందని చెప్పి తండా నుండి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తప్పి పోయిన సదరు విద్యార్థి ఎత్తు 5.6 ఫీట్లు, తెలుపు వర్ణం ఉంటాడని తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు నల్లని ప్యాంట్, ఎర్రని రంగు షర్ట్ ధరించి ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కరన్ కుమార్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిరాకుపల్లి పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8712656766 ఫోన్ నెంబర్ కు సంప్రదించి సమాచారం ఇవ్వాలని వారు సూచించారు.



Next Story

Most Viewed