గురుకుల విద్యార్థి అదృశ్యం

by Disha Web Desk 1 |
గురుకుల విద్యార్థి అదృశ్యం
X

దిశ, నారాయణఖేడ్: గురుకుల విద్యార్థి అదృశ్యమైన ఘటన నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎలుకరి రమేష్ (17) విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ శనివారం సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ న్యాల్కల్ మండలం గుంజేటి గ్రామానికి చెందిన ఎలుకరి రమేష్ తండ్రి తుకారం గురుకులలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాఠశాల నుంచి వెళ్లిపోయాడని తెలిపారు.


Next Story