రెవెన్యూ అధికారిని మోసం చేసిన సైబర్ క్రైమ్ నేరగాళ్లు

by Taduka Kalyani |

ఏసీబీ అధికారులమని నమ్మించి మండల రెవెన్యూ అధికారిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.

రెవెన్యూ అధికారిని మోసం చేసిన సైబర్ క్రైమ్ నేరగాళ్లు
X

దిశ, కొమురవెల్లి: ఏసీబీ అధికారులమని నమ్మించి మండల రెవెన్యూ అధికారిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. కొమురవెల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న తలారి ఐలయ్య కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము ఏసీబీ అధికారులమని నీపై కేసు కాకుండా ఉండాలంటే డబ్బులు పంపాలను బెదిరించడంతో 96 వేలు ఆన్లైన్ లో పంపించాడు. కొద్దిసేపటికి మోసపోయానని తెలుసుకున్న ఆర్ఐ కొమురవెల్లి పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Next Story