కాళేశ్వర జలాలతో..పటాన్ చెరు కు సాగునీరు : సీఎం కేసీఆర్

by Disha Web Desk 22 |
కాళేశ్వర జలాలతో..పటాన్ చెరు కు సాగునీరు : సీఎం కేసీఆర్
X

దిశ బ్యూరో, సంగారెడ్డి/ గుమ్మడిదల: సాగునీరు లేకపోవడంతో పటాన్ చెరు ప్రాంత రైతులు బాధపడుతున్నారని త్వరలోనే కాళేశ్వర జలాలతో అన్నదాతల బాధలు తీరుతాయని సీఏం కేసీఆర్ అన్నారు. మెదక్ పర్యటనకు వెళుతున్న సీఎం కేసీఆర్ కు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలం టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, డప్పు చప్పుళ్లతో గ్రాండ్ వెల్‌కం పలికారు. మరో సారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని గెలిపించాలని సీఎం పిలుపునిచ్చారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అద్భుతమైన అభివృద్ధి చేసుకుందామని అన్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యనారాయణ, ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డిలు ఉన్నారు.

Next Story