కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన కలెక్టర్ శరత్

by Disha Web Desk 11 |
కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన కలెక్టర్ శరత్
X

దిశ, సంగారెడ్డి: దృష్టి లోపాలను నివారించాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ డాక్టర్ శరత్ గురువారం సందర్శించారు. సంగారెడ్డి లోని ఇంద్ర నగర్ పీహెచ్ సీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిబిరాల నిర్వాహణ తీరును నిశితంగా పరిశీలించారు. కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి రోజు ఎంత మంది వస్తున్నారు, కంటి అద్దాలు, మందులు సరిపడా స్టాక్ అందుబాటులో ఉన్నాయా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శిబిరం వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. శిబిరానికి వచ్చే వారికి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు.

ప్రతి రోజు కనీసం 250 మందికి కంటి పరీక్షలు చేయాలన్నారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్న మహిళలతో కలెక్టర్ ముచ్చటించారు. ఇక్కడ కంటి పరీక్షలు చేస్తున్నట్లు ఎవరు చెప్పారు? ఎలా చూస్తున్నారు అంటూ అడిగారు. ఏఎన్ఎం, అంగన్ వాడీ టీచర్ ఇంటికి వచ్చి చెప్పారని, ఈ రోజు వచ్చి చూపించుకున్నానని కలెక్టర్ కు తెలిపారు. పైసలు లేకుండా ఫ్రీగా మంచిగా చూస్తున్నారని, తనకు దూరం చూపునకు సంబంధించిన అద్దాలు అవసరమని చెప్పారని, వారంలోగా అద్దాలు రాగానే ఇస్తారని చెప్పినట్లు తెలిపింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా ఇతరులను ప్రోత్సహించాలని కలెక్టర్ వారికి సూచించారు. కలెక్టర్ వెంట డా.శశాంక్ ఉన్నారు.

Next Story

Most Viewed