పది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ శరత్

by Disha Web Desk 1 |
పది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ శరత్
X

దిశ, సంగారెడ్డి: సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ శరత్ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, కరుణా హై స్కూల్ పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా గదుల్లో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు.

విద్యార్థుల హాజరును కలెక్టర్ ఆరా తీశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివొద్దని చీఫ్ సూపరింటెండెంట్ లకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండటంపై కలెక్టర్ శరత్ సంతృప్తిని వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ విజయకుమార్, చీఫ్ సూపరింటెండెంట్లు, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed