- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడుపాయల జాతరలో అపశృతి..
by Taduka Kalyani |
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఏడుపాయల జాతరలో చోటుచేసుకుంది.

X
దిశ, కొల్చారం: ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఏడుపాయల జాతరలో చోటుచేసుకుంది. పోలీసులు, భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండల పరిధిలోని శేరిపల్లీ గ్రామానికి చెందిన గురుకాని రవి (30), వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని జాతరలో దుకాణ సముదాయం వేసుకొని క్రయ విక్రయాల నిర్వహిస్తున్నాడు. కాగా ఆదివారం స్నాన చేయడానికి తన బావమరిదితో కలిసి చెక్ డ్యాం వద్దకు వెళ్లాడు.
ఈ క్రమంలో రవి నీటిలో మునిగి బయటకు రాలేదు. దీంతో పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో రవిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






