దేవుని కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

by Naveena |   (  Updated:2025-03-17 14:51:25  IST  )

మల్లన్న దేవుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.

దేవుని కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
X

దిశ, చిన్నశంకరంపేట: మల్లన్న దేవుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సోమవారం చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని యెడల ప్రజలు భక్తి భావం కలిగి ఉంటేనే మల్లన్న ఉత్సవాలు నిర్వహిస్తారని,ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సాన సత్యనారాయణ, బోయిని ప్రభాకర్, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More..

భక్త మార్కండేయ ఆలయంలో సంకట హర చతుర్థి పూజలు

Next Story