మెదక్ జే.ఎన్ రోడ్డులో దారుణ హత్య

by Disha Web Desk 1 |
మెదక్ జే.ఎన్ రోడ్డులో దారుణ హత్య
X

దిశ, మెదక్ ప్రతినిధి: పట్టణంలోని ప్రధాన మార్కెట్ జే.ఎన్ రోడ్డులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణం గాంధీ నగర్ కు చెందిన పిట్టల శ్రీనివాస్ కుట్టు మిషన్ రిపేర్ సెంటర్ ఉంది. ప్రతి రోజూ షాపుకు వచ్చి మిషన్లు రిపేర్ చేసి ఇంటికి వెళ్లే శ్రీనివాస్ గురువారం ఇంటికి వెళ్ళలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు శుక్రవారం మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.

శనివారం మధ్యాహ్నం జే.ఎన్ రోడ్డు లోని ఓ షాప్ వద్ద దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పైకి వెళ్లి చూడగా అక్కడ శ్రీనివాస్ మృతదేహం ఉంది. స్థానికులు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై కాలిన గాయాలు ఉండడం తో ఎవరో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు.


Next Story