- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చింత ఆరోగ్యం బాగుండాలని 101 కొబ్బరి కాయలు కొట్టిన నేతలు
దిశ, సంగారెడ్డి: రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని బీఆర్ఎస్ నాయకులు ఎఫ్ఆర్ఎస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం అస్లబల్ లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సంగారెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు చక్రపాణి అధ్వర్యంలో 101 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాట్లాడుతూ చింత ప్రభాకర్ ఆరోగ్యం కుదుట పడి ప్రజాజీవితంలో నిరంతరం కార్యక్రమాలు చేసే విధంగా అమ్మవారు నిండు ఆశీస్సులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చక్రపాణి, మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచ్ లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.