పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి: Minister Harish Rao

by Disha Web Desk 12 |
పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి: Minister Harish Rao
X

దిశ, చిన్నకోడూర్: పనిచేసే ప్రభుత్వాన్ని దీవిస్తే.. ఇంకా కష్టపడి పని చేస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు. సిద్ధిపేట అభివృద్ధి పై ప్రతిపక్షాలు అందరికీ మనపై ఏడుపే ఉన్నదని మంత్రి విమర్శించారు. మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామ శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల 5వ కల్యాణ ఉత్సవంలో హాజరై అమ్మవారికి రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ముదిరాజ్ పెద్దమ్మ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చిన్నకోడూర్ మండలాన్ని దినదినాభివృద్ధి చేస్తున్నామని, చిన్నకోడూర్ చుట్టూ ఎటు చూసినా రెండు-నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రూ.80 కోట్ల తో చిన్నకోడూర్ నుంచి సిద్ధిపేట వరకు బట్టర్ ఫ్లై లైట్లతో నాలుగు లైన్ల రహదారి నిర్మాణం ప్రారంభం కానున్నట్లు మంత్రి తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా ఎప్పుడు నిండని పెద్ద చెరువు.. కాళేశ్వరం నీళ్లతో 6 నెలల నుంచి మత్తడి దూకుతున్నదని, కాళేశ్వరం జలాలు రావడం తో రెండు పంటలు పండే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. చిన్నకోడూర్ దవాఖాన, స్కూల్ భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.పెద్దమ్మ తల్లి 5వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా ప్రారంభం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

మంత్రి వెంట గ్రామ సర్పంచ్ ఉమేష్, ఏంపీపీ మాణిక్ రెడ్డి రాష్ట్ర తెరాస ప్రధాన కార్యదర్శ రాధాకృష్ణ శర్మ. రైతుబంధు జిల్లా డైరెక్టర్ మేడి కాయల వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ వనిత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పుట్టబోయిన శ్రీనివాస్ ముదిరాజ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ముదిరాజ్ సంఘం నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




Read More.......

పార్లమెంట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఎంపీలు.. వీడియో వైరల్

Next Story

Most Viewed