ఎలుగు బంటి దాడి.. వ్యక్తికి గాయాలు

by Ratna Kumari |

ఎలుగు బంటి దాడిలో ఓ వ్య‌క్తి గాయాలపాలైన ఘ‌ట‌న రామాయంపేట మండ‌లం దంతేల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

ఎలుగు బంటి దాడి.. వ్యక్తికి గాయాలు
X

దిశ, నిజాంపేట : ఎలుగు బంటి దాడిలో ఓ వ్య‌క్తి గాయాలపాలైన ఘ‌ట‌న రామాయంపేట మండ‌లం దంతేల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. దంతేప‌ల్లి గ్రామానికి చెందిన కీర్తి సిద్దయ్య మేకలు కాయడానికి అడవికి వెళ్ళాడు. చెట్ల‌ పొదల చాటు నుంచి వచ్చిన ఎలుగు బంటి దాడి చేసింది. దీంతో అత‌నికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్ర‌స్తుతం సిద్దయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విష‌యం తెలుసుకున్న అటవీ శాఖ‌ అధికారులు అత‌న్ని పరామర్శించి.. ప్రభుత్వం తరపున బాధితులను ఆదుకుంటామని తెలిపారు. బాధితుడికి సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Next Story