మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

by Kema Shiva Kumar |

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని దీపంపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, దౌల్తాబాద్: మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని దీపంపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మస్కూరి నారాయణ (38) సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య అంజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పొస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story