రైలు ఢీకొని యువకుడి మృతి

by Kema Shiva Kumar |

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని జీడిపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

రైలు ఢీకొని యువకుడి మృతి
X

దిశ, మనోహరాబాద్: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని జీడిపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన దారం చారి, ఎల్లమ్మ దంపతుల కుమారుడు నర్సింగరావు. గురువారం రాత్రి నర్సింగరావు రైలు పట్టాల వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Next Story