మద్యం సేవించి.. వాహనం నడిపిన వ్యక్తికి రూ.10 వేల జరిమానా

by Kodari Anjali |

పోలీసులు వాహన తనిఖీల్లో మద్యం సేవించిన వ్యక్తి పట్టుబడగా.. రూ. 10 వేల జరిమానా విధించి కేసు నమోదు చేశారు.

మద్యం సేవించి.. వాహనం నడిపిన వ్యక్తికి రూ.10 వేల జరిమానా
X

దిశ, నిజాంపేట: పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగర్కొమ్ముల గ్రామానికి చెందిన కర్నాల సంపత్ మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు గుర్తించారు. అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థానం పదివేల నిర్మాణ విధించిందని నిజాంపేట ఎస్సై రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story