అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, పాపన్నపేట: అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అరికెల గ్రామ శివారులోని చెరువు వద్ద శనివారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం.. రాజ్య తండా పంచాయతీ పరిధిలోని ధూమ్ల తాండకు చెందిన రవి (28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు.

శుక్రవారం బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో ప్రతిరోజు ఇంటికి తాగి వస్తే ఎలా.. అంటూ భార్య లలిత అతడిని మందలించింది. అనంతరం భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో భార్య లలిత తెలిసిన వాళ్ల ఇళ్లలో, చుట్టపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం అరికెల గ్రామ శివారులోని చెరువు తూము వద్ద రవి, బైకు చెప్పులు ఉన్నాయంటూ అటుగా వెళ్లిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా నీటిలో తెలియాడుతున్న రవి మృతదేహం కనిపించింది. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులకు సమాచారం అందించారు .పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన భర్త మృతి పట్ల అనుమానం ఉందని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు.

Next Story

Most Viewed