విషాదం: స్నానానికి వెళ్లిన వ్యక్తి వాగులో శవమై తేలాడు

by Web Desk |
విషాదం: స్నానానికి వెళ్లిన వ్యక్తి వాగులో శవమై తేలాడు
X

దిశ,రామాయంపేట : ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన రామాయంపేట మండలం కోనాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిగుళ్ల మల్లయ్య (46) తన పొలం వద్ద గల సుద్ద వాగుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు స్నానానికి వెళ్ళాడు. సాయంత్రం అయినా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో భార్య సత్తవ్వ, కుటుంబ సభ్యులు వాగు దగ్గరకు వెళ్లి చూడగా చెట్టు కింద డబ్బులు, సెల్ ఫొన్ కనిపించాయన్నారు.

దీంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టగా మల్లయ్య మృతదేహం లభ్యమైంది. ఈత రాకపోవడంతో వాగులో నీట మునిగి మల్లయ్య మృతి చెందాడని భార్య సత్తవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుమన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Next Story

Most Viewed