చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

by Disha Web Desk 1 |
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
X

దిశ, కొల్చారం: చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు మృతిచెందిన ఘటన కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి గ్రామం శివారులోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అప్పాజీ పల్లి గ్రామానికి చెందిన కాదులూరి లక్ష్మయ్య (54) మంగళవారం ఘనపూర్ ప్రాజెక్టు దిగువ భాగంలో వనదుర్గ రెస్ట్ హౌస్ వెనుక ఉన్న మంజీరా నదిలోని చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో తెప్ప తిరగబడి లక్ష్మయ్య నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి కి భార్య నాగమణి, ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed