పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య

by Disha Web Desk 1 |
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, పెద్ద శంకరంపేట్: పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్ద శంకరంపేట మండల పరిధిలోని మల్కాపురం గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై బాలరాజు కథనం ప్రకారం మండలంలోని బద్దారం గ్రామానికి చెందిన గాజు రవీందర్ (38) లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం పెద్ద శంకరంపేట్ వచ్చిన రవీందర్ రాత్రి ఆటోలో స్వగ్రామానికి ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్తున్నాడు.

ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు మల్కాపురం శివారులో కాపు కాసి అతనిపై గొడ్డళ్లతో దాడి చేసి హతమార్చి బద్దారం గ్రామానికి వెళ్లే రహదారి పక్కన పడేశారు. అతని వెంటే ఉన్న గ్రామస్థులు అక్కడి నుంచి పారిపోయారు. విషయాన్ని వారు పోలీసులకు తెలియజేయగా, ఘటనా స్థలానికి మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జ్, పేట ఎస్ఐ బాలరాజు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఐ జార్జ్ తెలిపారు. మృతుడికి భార్య సుజాత, ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

Next Story

Most Viewed