- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medak: గాంధీ లో ఏం జరుగుతుంది..? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ట్వీట్
గాంధీ లో ఏం జరుగుతుంది అని మెదక్(Medak) బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ప్రశ్నించారు.

దిశ, వెడ్ డెస్క్: గాంధీ లో ఏం జరుగుతుంది అని మెదక్(Medak) బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో యంత్రాలు మూలన పడటంతో ఎక్స్రే(X-ray) తీయించుకోవడానికి రెండు మూడు రోజుల సమయం పడుతోందని వస్తున్న వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. గాంధీ లో ఏం జరుగుతుందని, ఆస్పత్రిలో యంత్రాలు మూలకుపడ్డాయని, ఐపీ(IP), ఓపి(OP) విభాగాలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. అలాగే ఎక్స్రే తీయించుకోవడానికి 2,3 రోజులు పడిగాపులు పడాల్సిన దయనీయమైన దుస్థితి ఏర్పడిందని, గాంధీ ఆస్పత్రి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ(State Government) నిర్లక్ష్య ధోరణి(Carelessness)కి నిదర్శనంగా ఉందని ఆరోపించారు. అంతేగాక ఆరోగ్య శాఖ(Health Department) పనితీరు ఇదేనా? అని మండిపడ్డారు. అలాగే దీని పై ఆరోగ్య శాఖ , సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు కోరారు.






