మాయావతి తెలంగాణ టూర్ డేట్ ఫిక్స్

by Disha Web Desk 9 |
మాయావతి తెలంగాణ టూర్ డేట్ ఫిక్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుల రాజకీయాల్ని, దొరలహంకారాన్ని కాలరాయడానికి తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వడానికి బెహంజీ మాయావతి తెలంగాణ గడ్డపైకి వస్తున్నారని తెలంగాణ బీఎస్పీ నాయకులు అంటున్నారు. ఈ నెల 7న ఆ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్ నగర్‌‌లోని విద్యార్థి అమరుల ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిధిగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి హాజరుకానున్నారు. తెలంగాణ భరోసా పేరుతో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లు చకచకాగా జరుగుతున్నాయి. అసమానతలు, అణివేతలు, దొరల గడీల పాలన నుంచి విముక్తి కోరుతూ ఈ సభను నిర్వహిస్తున్నారు. మే 7 (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకు వేలాది మందిగా తరలిరావాలని బీఎస్పీ నాయకులు కోరుతున్నారు. కాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాయావతి తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. దీంతో మాయావతి ఏం మాట్లాడుతారోననే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.


Next Story

Most Viewed