Maoists: ఆరుగురు మావోయిస్టులు అరెస్ట్.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

by Disha Web Desk 1 |
Maoists: ఆరుగురు మావోయిస్టులు అరెస్ట్.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
X

దిశ, వెబ్‌‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బమరక అటవీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా తనిఖీల చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో పోలీసులను లక్ష్యం‌గా చేసుకొని విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు భారీ‌గా పేలుడు పదార్థాల డంప్‌ను అటవీ ప్రాంతంలో దాచిపెట్టారు. అందులో 19 బీజీఎల్ బాంబులు, 5 కిలోల చొప్పుల స్టోర్ చేసిన 4 మందు పాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులతో పాటు ఆరుగురు మావోయిస్ట్‌లను అరెస్టు చేశారు.

Next Story