ఇవాళ తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

by Disha Web Desk 2 |
ఇవాళ తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజుల క్రితం గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. కాల్పులను బూటక ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించింది. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న వారిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని కోరింది. స్వచ్ఛందంగా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. మార్చి 19వ తేదీన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిపై రూ.36 లక్షల నగదు బహుమతి రివార్డు ఉండటం గమనార్హం.



Next Story

Most Viewed