స్పీడ్ పెంచిన మాణిక్ రావు థాక్రే.. ఒకేరోజు మూడు కమిటీలతో భేటీ!

by Disha Web Desk 19 |
స్పీడ్ పెంచిన మాణిక్ రావు థాక్రే.. ఒకేరోజు మూడు కమిటీలతో భేటీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్​వ్యవహారాల ఇంచార్జీ మాణిక్​ రావు థాక్రే బుధవారం గాంధీభవన్​లో బిజీ బీజీగా గడిపారు. కిసాన్​ కాంగ్రెస్​, ట్రైబల్​ వింగ్​, హాథ్​ సే హాథ్​ జోడో యాత్ర కమిటీలతో వరుసగా భేటీ అయ్యారు. ఆయా కమిటీల పరిధిలోని అంశాలు, పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కార్యకలాపాలపై ఆరా తీశారు. అనంతరం పార్టీ గెలుపు కోసం సలహాలు, సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ఇంచార్జ్ గిరీష్ చోడొంకర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్ జావిద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ ,ఎస్టీ సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. థాక్రే రాకతో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గాంధీభవన్​లో హడావిడి నెలకొన్నది.

Also Read..

ఎన్నికల వేళ T- బీజేపీ కీలక నిర్ణయం!

Next Story

Most Viewed