Manda Jannadham మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోగ్యం అత్యంత విషమం

by Kema Shiva Kumar |

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Manda Jannadham మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోగ్యం అత్యంత విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, మూడు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రాగా.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్‌ (Hyderabad)లోని నిమ్స్ ఆసుపత్రి (NIMS Hospital)కి తరలించారు. జగన్నాథం‌ను పరిశీలించిన వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సను అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. జగన్నాథం వెంట ఆసుపత్రిలో కుటుంబసభ్యులు, సోదరుడు మాజీ ఎంపీపీ వెంకట్ కుమార్, కుమారుడు శ్రీనాథ్ తదితరులు ఉన్నారు.

Next Story