Malla Reddy:నేడు ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు

by Disha Web Desk 4 |
Malla Reddy:నేడు ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, బంధువులపై ఐటీదాడుల అనంతరం సోమవారం అధికారులు మంత్రి కుటుంబసభ్యులను విచారించనున్నారు. రూ. వందకోట్ల డొనేషన్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నేటి విచారణ కీలకం కానుంది. మల్లారెడ్డితో పాటు 16 మందికి ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఐటీ ముందు 14 మంది కుటుంబ సభ్యులు హాజరు కానున్నట్లు సమాచారం. అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి, కుమారులు, బంధువులు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మంత్రి మల్లారెడ్డి ఐటీ ఎదుట హాజరు కావడం లేదని తెలిసింది. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లను కుటుంబసభ్యుల ఎదుట ఉంచి కీలక అంశాలపై ప్రశ్నించనున్నారు. కాగా మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు 48 గంటల పాటు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed