జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తాం.. కేటీఆర్‌తో భేటీ అనంతరం మాల నేతల ప్రకటన

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై మాల సామాజికవర్గ నేతలు(Mala Community Leaders) కీలక వ్యాఖ్యలు చేశారు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తాం.. కేటీఆర్‌తో భేటీ అనంతరం మాల నేతల ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై మాల సామాజికవర్గ నేతలు(Mala Community Leaders) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కేటీఆర్‌(KTR)తో మాల నేతలు, ప్రతినిధులు భేటీ అయ్యారు. కేటీఆర్‌తో ఎస్సీ రిజర్వేషన్ల అమలు తీరుపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్లలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించలేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతామని ప్రకటించారు. వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ మాల సామాజికవర్గ నేతను బరిలో పెడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టినా ఓడిస్తాం.. మా సత్తా ఏంటో కాంగ్రెస్‌కు చూపిస్తామని అన్నారు.

Next Story