పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు : మంత్రి జూపల్లి

by Disha Web Desk 23 |
పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు :  మంత్రి జూపల్లి
X

దిశ,కొల్లాపూర్ : పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, మళ్లీ మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ మండలం పరిధిలోని సోమశిల, మాధవస్వామి నగర్ గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ ఎంపీగా మల్లు రవిని గెలిపించి ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ వ్యవధిలోనే గ్యారంటీ అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల్లో మద్దతుగా నిలబడి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు. మల్లేశ్వరం యాగం పల్లి , మాధవ స్వామి నగర్, గ్రామ ప్రజలకు ఆరోజు ఇందిరమ్మ రాజ్యం లో పేద ప్రజలందరికీ దళిత అందరికి పరం పోగు భూమిలు ఇచ్చామన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు నరసింహ యాదవ్ ,సీనియర్ నాయకులు , గోవిందు గౌడ్, గోపాల్, మాజీ సర్పంచ్ లు గోపీనాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు, భాస్కర్ గౌడ్, నరసింహ, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed